ఇటీవల ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా జార్ఖండ్లోని ధన్బాద్ పట్టణంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకొంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ అగ్నిప్రమాదంలో డాక్టర్ దంపతులు సహా ఆరుగురు అగ్నికి ఆహూతి అయ్యారు. జార్ఖండ్లోని ధన్బాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో శనివారం (జనవరి 28) అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జార్ఖండ్ రాజధాని రాంచీకి 170 కి.మీ. ధన్బాద్ పట్టణం ఉంది. ఈ పట్టణంలోని బ్యాంక్ మోర్ ప్రాంతంలో మంచి పేరున్న డాక్టర్ దంపతులు వికాస్ హజ్రా, ప్రేమా హజ్రా.. నర్సింగ్ హోమ్ - కమ్ - ప్రైవేట్ హౌస్ ఏర్పాటు చేశారు. భవనంలోని ఓ ఫ్లోర్లో
నర్సింగ్ హోమ్లోని స్టోర్ రూమ్లో అర్ధరాత్రి మంటలు చెలరేగినట్లు అధికారులు. అనంతరం మిగిలిన ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఎక్కువ ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
ఆస్పత్రి యజమాని డాక్టర్ వికాస్ హజ్రా, అతడి భార్య డాక్టర్ ప్రేమా హజ్రాతో పాటు వారి మేనల్లుడు సోహన్ ఖమారి.. పొగ పీల్చుకొని ఊపిరి ఆడకపోవడం వల్ల మరణించారని డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ప్రేమ్ కుమార్ తివారీ తెలిపారు. వీరితో పాటు ఇంటి పనిమనిషి తారా దేవి కూడా మృతి చెందారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ప్రేమ్ కుమార్ తెలిపారు. ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘ధన్బాద్లోని హజ్రా మెమోరియల్ హాస్పిటల్లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ప్రముఖ వైద్య దంపతులు డాక్టర్ వికాస్, డాక్టర్ ప్రేమ హజ్రా సహా 6 మంది మృతి చెందారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో దు:ఖాన్ని భరించే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తుననా’ అని సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa