విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో మాఘ మాసం రెండవ శుక్రవారం భక్తులతో కిట కిట లాడింది, ఈరోజు ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై ప్రత్యేక కుంకుమార్చన, పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది, సాయంత్రం అమ్మవారికి సుగంధ ద్రవ్య పంచామృత జలాభిషేకములు ఆలయ అర్చకులు పట్నాల సుబ్బారావు శర్మ, హరిప్రసాద్ శర్మ, మూర్తి శర్మ, శాస్త్రోక్తంగా జరిపించడం జరిగింది,దుర్గానగర్ వాస్తవ్యులు శ్రీ దేవన్, శ్రీమతి శ్రీదేవి ఆర్ధిక సహాయం తో ఈరోజు ఆలయంలో పులిహోర ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది, భక్తులకు పులిహోర ప్రసాదం ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేయడం జరిగింది, జివియంసి జోన్ 2 కమీషనర్ శ్రీమతి కనకమహాలక్ష్మి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది, మరియు శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు,
ఈ సందర్భంగా జోన్ 2 కమిషనర్ గా కనకమహాలక్ష్మి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా ఆలయానికి విచ్చేసి సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేద మంత్రాలతో ఆశీర్వాదం చేసి అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కమీషనర్ గారిని దుశ్శాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదం, అమ్మవారి చిత్ర పటాన్ని అందజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు, ఉపాధ్యక్షులు పి. వి. జి. అప్పారావు సభ్యులు కేశనకుర్తి అప్పారావు, యస్. ఆర్. బాబు, దుర్గాశి సోంబాబు, పొట్నూరు హరికృష్ణ, మరుపిల్లి ఆనంద్, పిళ్లా రమణ, పిళ్లా మోహన్ శివ కృష్ణ, నాగోతి అప్పలరాజు, గ్రామ పెద్దలు బావిశెట్టి సత్యనారాయణ, ఆలయ ముఖ్య సభ్యులు పిళ్లా వెంకటరమణ, పిళ్లా అప్పన్న , పి. రాంబాబు, జగ్గారావు మరియు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa