కడప నగరంలోని అంబేద్కర్ కూడలి నుంచి వై జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ కొరకు భవన యజమానులు సహకరించడం గర్వించదగ్గ విషయమే డిప్యూటీ సీఎం అంజాద్ భాషా అన్నారు. శనివారం కడప నగరంలోని నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో టౌన్ ప్లానింగ్ డిసిపి కుమార్, ఏసీపి నాగేంద్ర ల ఆధ్వర్యంలో డా. బి ఆర్ అంబేద్కర్ సర్కిల్ నుండి వై జంక్షన్ మధ్య 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్ విస్తరణకు అంగీకరించి జీవో ఎంఎస్. నెంబర్ 223 ఎం ఏ అండ్ యు డి ప్రకారం టిడిఆర్ బాండ్లు తీసుకున్న భవన యజమానులు వెంకటసుబ్బయ్య, సుబ్రమణ్యం, దేవి, శ్రీనివాసులు, నాగేంద్ర, కిషోర్ కుమార్, భద్రవతమ్మ, సుబ్బారెడ్డి, జయరామి రెడ్డి, రెడ్డప్ప తదితరులను డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, కడప నగర మేయర్ వైఎస్సార్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa