ఖైదీ పీజీలో డిస్టెక్షన్లో పాసయ్యాడు అంటే అది మామూలు విషయం కాదు. విచారణ ఖైదీగా ఉన్న ఓ యువకుడు.. జైల్లో ఉంటూనే పరీక్షలకు హాజరై డిస్టెక్షన్లో పాసయ్యాడు. పేలుళ్ల కేసులో నిందితుడిగా మాజీ విద్యార్థి నేత ఎం.ఏలో అగ్రస్థానంలో నిలిచి గవర్నరు నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. 2019లో అసోం రాజధాని గువాహటిలో జరిగిన పేలుళ్ల కేసులో విద్యార్థి నేత సంజీబ్ తాలుక్దార్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో గువాహటి జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. అయితే, జైల్లో ఉన్నా చదువు కొనసాగించాలని భావించాడు. దీంతో కృష్ణ కాంత హండిక్యూ స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎం.ఏ సోషియాలజీ కోర్సులో చేరాడు.
ఫైనల్ ఇయర్ పరీక్షలను ఇటీవలే రాసి 71 శాతం మార్కులను సాధించి, మొదటి స్థానంలో నిలిచాడు. గవర్నరు జగదీశ్ ముఖి సంజీబ్కి గురువారం గోల్డ్ మెడల్ను బహూకరించారు. వాస్తవానికి బోటనీలోనే ఎంఫిల్ చేయాలని భావించినా.. జైల్లో ల్యాబ్ సౌకర్యం లేకపోవడంలో సోషియాలజీ సబ్జెక్టును ఎంచుకున్నాడు. గువహటి పేలుళ్ల కేసులో సంజీవ్తో పాటు మరో ముగ్గురిపై చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఎన్ఐఏ కేసు నమోదుచేసింది. అరెస్ట్ అనంతరం గువహటి జైలులో ఉంచారు.
జైలు అధికారి ఒకరు మాట్లాడుతూ.. సంజీబ్కు కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువని అన్నారు. సోదరి డాలీ మాట్లాడుతూ.. తన సోదరుడి బెయిల్ పిటిషన్పై గువహటి హైకోర్టు విచారణ చేపట్టనుందని తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రకాశ్ రాజ్కోన్వార్కు హైకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. అరెస్టయ్యే నాటికి సంజీబ్ గువహటి విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ను చేస్తున్నాడని ఆమె చెప్పారు. జైల్లో ఉండటం వల్ల కొనసాగలేదని పేర్కొన్నారు. గతంలో అదే వర్సిటీ పీజీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa