రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, రోడ్లు దుస్థితి, లా అండ్ ఆర్డర్ సమస్యలు, అప్పులపై ఎప్పటికప్పుడు సెటైరికల్గా స్పందించే జనసేనాని మరోసారి సీఎం జగన్పై వ్యంగాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ను ఉద్దేశించి ట్విటర్ వేదికగా ‘అప్పు రత్న’ అవార్డును ప్రకటిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు!!. ఈ మేరకు మంగళవారం ట్విటర్లో పోస్ట్ చేసిన ఒక వ్యంగ్య పోస్టర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ‘భారత రత్న’ లాగా ఇది కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డు అంట సార్’ అని ఒక కొటేషన్ కూడా ట్విటర్ పోస్టర్లో పొందుపరిచారు. దీంతోపాటు అప్పురత్న అవార్డు పొందినట్లు సీఎం జగన్ పేరు మీద ప్రశంసా పత్రాన్ని పోస్టర్లో పొందుపరిచారు. వైసీపీ సర్కార్ అప్పుల్లో రికార్డు సృష్టించిందని, కేవలం 9నెలల్లో రూ.55,555 కోట్లు అప్పులు తీసుకువచ్చినట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. జగన్ వ్యక్తిగత సంపద పెంచుకోవడం మర్చిపోవద్దని, రాష్ట్ర సంపద, పురోగతి కుక్కలకు వెళ్లనివ్వాలని ఎద్దేవా చేశారు. మీ వ్యక్తిగత ఆస్తులు మాత్రం పొగొట్టుకొవద్దన్న అర్థం వచ్చేలా ట్విటర్ ద్వారా విమర్శలు చేశారు. ఈ ట్వీట్ను పది వేల మంది రీట్వీట్ చేశారు. 21 వేల మంది లైక్ చేశారు. 4.48 లక్షల మంది ట్వీట్ చూసి, చదివారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa