గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ఓబులవారిపల్లి మండలం గాదెల గ్రామ సచివాలయ పరిధిలోని జి. వి పురం గ్రామం నందు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను, సమస్యలను అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో పరిష్కార దశగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిడి నాగేంద్ర, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, మాజీ ఎంపీపీ రామకృష్ణ, పెంచలయ్య, మల్లికార్జున, నరసింహులు, ఎంపీడీవో విజయ రావు, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, ఎంఈఓ పద్మజ, ఎంపిటిసిలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa