టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. స్థానిక ప్రజలు, అభిమానులు లోకేష్ పాదయాత్ర కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పలు సామాజికవర్గాలతో, యువతతో లోకేష్ ముఖాముఖి నిర్వహిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను తీరుస్తానంటూ హామీ ఇస్తున్నారు. ఈరోజు ఉదయం సత్యవేడు నియోజకవర్గం పిచాటూరులో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. తనకు ఎదురైన ఓ ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులను ఆప్యాయంగా పలకరించారు. బస్సులో కాసేపు ఉన్న లోకేష్... టీడీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఛార్జీలు.. వైసీపీ పాలన లో ఆర్టీసీ ఛార్జీల మధ్య వ్యత్యాసాన్ని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఛార్జీలు పెంచి విపరీతంగా భారం పెంచారని లోకేష్కు విన్నవించారు. ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత సిబ్బంది పడుతున్న ఇబ్బందుల గురించి కండక్టర్ను యువనేత అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa