జగన్ ఒక పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అని జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ ప్రశంసల వర్షంకురిపించారు. కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగడం చాలా అనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి బుధవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. జిందాల్ కంపెనీ చైర్మన్ సజ్జన్ జిందాల్తో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సజ్జన్ జిందాల్ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు.
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ చాలా కష్టపడుతున్నారు. వారి నాన్న అడుగుల్లో నడుస్తున్నారు. నేను ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో తిరిగాను. చాలా మంది ముఖ్యమంత్రులను కలిశాను. కానీ.. జగన్ లాంటి సీఎంను చూడలేదు. గత మూడేళ్లలో ఏపీ జీడీపీ గ్రోత్ బాగుంది. దాంట్లో జగన్ కష్టం కనిపిస్తోంది. ఈ మధ్య విజయవాడలో నేను ముఖ్యమంత్రి కలిశాను. అప్పుడు జగన్ చాలా విషయాలు వివరించారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి గంటా 25 నిమిషాల పాటు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. ప్రతీఒక్కరిని ప్రగతి పథంలో నడిపించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే.. వైఎస్ జగన్ ఒక పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్' అని జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa