కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. శుక్రవారం నాడు స్వామివారిని 63,633 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,352 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.68 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa