లోకేష్ ఉన్నంతవరకు వైసీపీ విజయానికి ఢోకా లేదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా సెటైర్లువేశారు. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వెళితే.. సున్నా అవుతారని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. కన్నాపై సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఇబ్బంది లేదని.. అయితే కన్నా మాత్రం టీడీపీలోకి వెళ్లి సున్నా కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఇదే కన్నా లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబు నాయుడు తనను భౌతికంగా ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారని చేసిన ఆరోపణలను ఆయన గుర్తు చేశారు.
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వెళ్లి ఏం సాధించాలనుకుంటున్నారో తెలియడం లేదని.. మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. లోకేష్ విషయానికి వస్తే.. ఆయన రాజకీయాల్లో ఉన్నంత వరకూ వైసీపీ విజయానికి ఢోకా ఉండదని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఆయనే కాదు.. ఇతర మంత్రులు కూడా కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్ష పదవిలో ఉండి.. టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్నారని.. మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. అందుకే ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa