టేకు చెట్టుకు ఉన్న డిమాండ్ ఏ పాటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి టేకు చెట్టులో కూడా శ్రేష్టమైనవి ఉంటాయటా. ఇదిలావుంటే ఎండిపోయిన ఓ టేకు చెట్టు వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఓ వ్యక్తి దాదాపు రూ.40 లక్షలు చెల్లించి ఆ చెట్టును దక్కించుకున్నారు. 114 ఏళ్ల కిందట బ్రిటిష్ కాలంలో నాటిన ఈ చెట్టు నీలాంబరి టేకు రకానికి చెందింది. ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ఈ వృక్షం పూర్తిగా ఎండిపోయి.. ఇటీవల కూలిపోయింది. కేరళలోని నెదుంకాయం అటవీ డిపోలో ఫిబ్రవరి 10న దీన్ని వేలానికి ఉంచగా.. బృందావన్ టింబర్స్ యజమాని అజీశ్ కుమార్ రూ.39.25 లక్షలకు కొనుగోలు చేశారు. 8 క్యూబిక్ మీటర్ల మందంతో ఉన్న ఈ టేకును.. మూడు భాగాలుగా చేసి విక్రయించారు.
1909లో నాటిన ఈ చెట్టును అటవీ శాఖ అధికారులు సంరక్షిస్తున్నారు. నెదుంకాయం అటవీ డిపో అధికారి షెరీఫ్ మాట్లాడుతూ.. ‘‘కావాలని కొట్టేసిన వృక్షాలను వేలానికి ఉంచరు.. ఎండిపోయి, దానంతట అదే కూలిపోయిన వృక్షాలను మాత్రమే వేలం వేస్తారు. నీలాంబరి టేకుకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది’’ అని వెల్లడించారు. తాజాగా వేలం వేసిన వృక్షాన్ని మూడు భాగాలు చేయగా.. పెద్దది మూడు మీటర్ల కంటె ఎక్కువ పొడవు ఉంది. దీనికి రూ.23 లక్షలు చెల్లించగా.. మిగిలి రెండు భాగాలకు రూ.11 లక్షలు, రూ.5.25 లక్షలు చెల్లించారు.
‘‘ఈ విషయం చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం.. 1909లో బ్రిటీష్ వారు నాటిన, కేరళ అటవీప్రాంతం పరిరక్షణ ప్లాట్గా ఉంచిన ప్రదేశంలో 8 క్యూబిక్ మీటర్ల కలప ఉన్న చెట్టును సేకరించాం.. అందులో అతిపెద్ద ముక్క ఇప్పటివరకు మాకు లభించిన అత్యుత్తమమైన వాటిలో ఒకటి భారీ ధర పలికింది.. ఇది మాకు చాలా సంతోషకరమైన క్షణం.. ప్రధాన విషయం ఏమిటంటే నీలంబరి టేకు రికార్డు స్థాయి ధరకు అమ్ముడపోయింది. ఈ టేకు అంతర్జాతీయ బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రాముఖ్యత ఉంది. చాలా సంవత్సరాలుగా ఆ హోదాలో దీనిని అభివృద్ధి చేస్తున్నాం’’ అని షెరీఫ్ అన్నారు. అజీశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా కేరళ అటవీ శాఖ సిబ్బందికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. కలపను లారీలో లోడు చేయడానికి అదనంగా రూ.15 వేలు చెల్లించినట్టు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa