కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడిన దృశ్యాలను ప్రసార మాధ్యమాల్లో చూసిన రాష్ట్ర ప్రజలు అభద్రతా భావానికి లోనయ్యారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... పోలీసుల సమక్షంలోనే విధ్యంసం జరగడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగన్ శాడిస్టు అని, ఆయన పాలన ఇంత దారుణంగా వుంటుందని ప్రజలు ఊహించలేదన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడులు చేసి, టీడీపీ నాయకులపైనే కేసులు పెట్టడం మరీ దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకుని, జగన్ ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేసి, రాష్ట్ర డీజీపీని సరండర్ చేయాలని బండారు డిమాండ్ చేశారు. పార్టీ విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.... వల్లభనేని వంశీకి వచ్చే ఎన్నికల్లో గన్నవరం ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైసీపీకి ఐపీఎస్ అధికారులు తొత్తులుగా మారారని, పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తే ఇలాంటి దారుణాలు జరగవన్నారు. మాజీ మంత్రి కొండ్రు మురళీ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ మార్కు గూండా పాలన సాగుతున్నదని విమర్శించారు. సజ్జల దర్శకత్వంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తూ, ఎమ్మెల్యే వంశీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, దక్షిణం ఇన్చార్జి గండి బాబ్జీ, నజీర్, పాశర్ల ప్రసాద్, కాళ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa