కన్నా లక్ష్మీనారాయణ పార్టీలోకి రావడం శుభపరిణామమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కన్నాను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. 'రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లో నిబద్ధత ప్రకారం కన్నా పనిచేశారు. పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం' అని చంద్రబాబు కొనియాడారు.
ఇదిలావుంటే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం.. మధ్యాహ్నం 2.48 గంటలకు చంద్రబాబు సమక్షంలో కన్నా తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు పసుపు కండువా కప్పి.. కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు టీడీపీ కండువా కప్పుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa