భక్తుల సౌకర్యార్థం కొత్తకొత్త ఆలోచనలకు టీటీడీ శ్రీకారం చుడుతోంది. తాజాాగా తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. నేడు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదలకానుంది. శ్రీవాణి టికెట్లకు సంబంధించిన మార్చి, ఏప్రిల్, మే నెలల ఆన్ లైన్ కోటాను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఆన్ లైన్ లో రోజుకు 500 టికెట్లు చొప్పున భక్తులకు అందుబాటులో ఉంటాయి. అలాగే వసతి గదులు కూడా విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. మరోవైపు టీటీడీ జేఈవో కార్యాలయంలో రోజుకు 400 టికెట్లు ఆఫ్లైన్లో.. 100 టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే తిరుమలలోని గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్లైన్లో శ్రీవాణి టిక్కెట్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కావున తిరుమలలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు. మార్చి నుంచి, 1000 శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్లైన్లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయి. టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆఫ్ లైన్ లో టికెట్లు పొందాలని టీటీడీ కోరింది.
ఎస్వీబీసీ హిందీ ఛానల్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని దేశమంతటా ప్రచారం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష జరిగింది. హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల, ఇతర అనుబంధ ఆలయాల్లో నిర్వహిస్తున్న వివిధ సేవలు, కైంకర్యాలు, పండుగలు, ధార్మిక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి భక్తుని చెంతకు తీసుకెళ్లాలన్న ప్రధాన ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభమైందన్నారు ఈవో.
ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ ఛానళ్లు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయన్నారు. ఎస్వీబీసీ హిందీ ఛానల్ కు కూడా ప్రాచుర్యం కల్పించేందుకు హిందీ మాట్లాడే ప్రాంతాలలో జియో వంటి వేదిక అవసరమన్నారు. జియో ఫైబర్ నెట్ ప్లాట్ఫారమ్లో ఎస్వీబీసీ హిందీ ఛానల్ ను ప్రసారం చేయడం, ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోకు మరింత ప్రాచుర్యం కల్పించడంపై జియో అధికారులతో చర్చించాలని ఎస్వీబీసీ సీఈవోను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa