ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌ను వెంటాడుతున్న ఆర్ధిక ఇబ్బందులు,,,ప్రధాని షెహబాబ్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహం

international |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 04:52 PM

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ ప్రభుత్వంపై   క్రమంగా ప్రజాగ్రహం  పెరుగుతోంది.  దేశంలో నెలకున్న దుస్థితికి పాలకులే కారణమని మండిపడుతున్నారు. గతంలోనూ ఎన్నడూలేని విధంగా నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో ప్రజలు జేబులకు చిల్లులుపడుతున్నాయి. ఈ క్రమంలోనే పాక్‌లో నెలకున్న పరిస్థితులపై ఆ దేశ పౌరుడు స్పందించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశం బాగుపడాలంటే మోదీయే తమకు ప్రధానిగా రావాలని అతడు కోరడం గమనార్హం. అందుబాటు ధరలో సరుకులు పొందాలంటే ఆయనే పాక్‌కు పాలించాలని కోరుతున్నాడు.


‘పాకిస్థాన్ నుంచి ప్రాణాలతో పారిపోండి లేదా భారత్‌కు వెళ్లిపోండి’ అంటూ ఓ స్థానికుడు వీధుల్లో నినాదం చేస్తుండగా.. అతడి మాజీ జర్నలిస్ట్ సానా అంజాబ్ ప్రశ్నించారు. ‘షెహబాజ్ షరీఫ్‌ వద్దు, ఇమ్రాన్‌ ఖాన్ వద్దు, మాకు భారత ప్రధాని మోదీనే కావాలి’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ సందర్భంగా షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ను గట్టెక్కించగలిగేది భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని అతను పేర్కొన్నాడు. అంతేకాదు, తాను పాక్‌లో పుట్టకపోయినా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశాడు.


‘‘భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోకుండా ఉండాల్సింది.. కిలో టమోటాలు రూ.20, కిలో చికెన్ రూ.150, లీటరు పెట్రోలు రూ.50గా లభించాలని కొరుకుంటున్నాను.. మనం ఇస్లామిక్ దేశంగా ఉన్నాం.. కానీ దురదృష్టవశాత్తూ ఇక్కడ ఇస్లాం లేదు.. మోదీ మనకంటే చాలా గొప్పవారు.. అక్కడ ప్రజలు ఆయనను ఎంతగానో గౌరవిస్తారు.. అనుసరిస్తారు. మనకు నరేంద్ర మోదీ ఉంటేనవాజ్ షరీఫ్ లేదా బెనజీర్ లేదా ఇమ్రాన్, జనరల్ పర్వేజ్ ముషారఫ్ అవసరం లేదు.. మనకు కావలసింది ప్రధాని మోదీ మాత్రమే.. దేశంలోని అన్ని దుర్మార్గాలను ఆయన మాత్రమే ఎదుర్కోగలరు.. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.. అయితే మనం ఎక్కడా లేం’’ అని చెప్పాడు,


‘‘నేను మోదీ పాలనలో జీవించడానికి సిద్ధంగా ఉన్నాను.. మోదీ గొప్ప వ్యక్తి, చెడ్డ మనిషి కాదు. భారతీయులకు టమాటోలు, చికెన్ సరసమైన ధరలకు లభిస్తున్నాయి. మీరు రాత్రిపూట మీ పిల్లలకు ఆహారం ఇవ్వలేనప్పుడు, మీరు పుట్టిన దేశాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తారు.. మోదీ మన దేశాన్ని పాలించాలని నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా బీజేపీ నేతలు దీనిని షేర్ చేస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa