ధర్మవరం నియోజకవర్గంలో మార్చి నెలలో జరగబోవు నారా లోకేష్ యువగళం పాదయాత్రను టీడీపీ నియోజకవర్గం ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ నాయకత్వంలో విజయవంతం చేసి, యువత సత్తా చాటుదామని పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి పురుషోత్తంగౌడ్ పిలుపు నిచ్చారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో శనివారం తెలుగు యువత, టీఎనఎస్ఎఫ్, ఐటీడీపీ నాయకులతో సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....తెలుగుదేశం పార్టీ జాతీ య ప్రధానకార్యదర్శి నారాలోకేశ మార్చిలో జిల్లాలో చేపట్టే యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు 1000మంది యువతతో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేద్దామని తెలిపారు. లోకేశ పాదయాత్ర ముగిసే వరకు వెంట ఉంటూ విజయవంతం చేయడానికి కృషిచేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి వార్డు, ప్రతి గ్రామం నుంచి యువత పాదయాత్రకు తరలిరావాలని కోరారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చిన సీఎం జగన్మోహనరెడ్డి యువతను వంచించారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa