ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరస్వతి విద్యామందిర అభివృద్ధికి సహకరించిన దాతలకుసన్మానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2023, 12:05 PM

మాతృసంస్థ శ్రీ సరస్వతీ విద్యా పీఠం స్వర్ణోత్సవాల సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక పాఠశాల అభివృద్ధికి హితోదికముగా సహకరించిన దాతలకు, విధ్యాభిమానులకు సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ భావాలు గల యువతీ, యువకుల నిర్మాణమే లక్ష్యంగా పనిచేసే పాఠశాల, మన గ్రామములో వుండటం సంతోషమని, సరస్వతీ విద్యా మందిరం పాఠశాల అవసరం ఈనాటి సమాజానికి ఎంతో అవసరమని, ఈ పాఠశాల అభివృద్ధికి చేయూత నిచ్చి నిలుపుకోవడం మన బాధ్యత అన్నారు. ఉన్నత విలువలు కలిగిన యువత నిర్మాణమేశ్రీ సరస్వతీ విద్యాపీఠం లక్ష్యమని, చదువు స్వార్థం కోసం కాదు, సమాజం కోసము ఉపయోగపడాలని ప్రధానాచార్యులు కరణం తిరుమల రావు అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి పాణ్యం రంగనాథ శర్మ , పాఠశాల కార్యదర్శి రామమోహన్ గుప్త ప్రారంభం నుండిఇప్పటి వరకు విద్యాపీఠం, పాఠశాల సాధించిన ప్రగతి వివరించారు. 30 మంది పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను కమిటీసభ్యులు సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు నాగభూషణం, హరికిషోర్, మయూర, ఆచార్య బృందం పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa