ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని అమరావతి కేసు విచారణ మరోసారి వాయిద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2023, 01:09 PM

రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ వ్యాజ్యాలపై మార్చి 28న విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘అమరావతే రాష్ట్ర రాజధాని’ అని హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వంతోపాటు.. రైతులు, అమరావతి పరిరక్షణ సమితి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వాస్తవానికి ఈ కేసులను ఈ నెల 23న విచారించాల్సి ఉంది. ఒకసారి నోటీసు అయిన అంశాలను బుధ, గురువారాల్లో విచారించబోమని ఈ నెల 14న సుప్రీం కోర్టు సర్క్యులర్‌ జారీ చేసింది. కానీ, గత 23న కేసుల విచారణ జరగలేదు. తాజాగా.. సోమవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీం కోర్టు సర్క్యులర్‌ కారణంగా కేసులు విచారణకు రాలేదని, కోర్టుకు హోలీ సెలవుల అనంతరం వెంటనే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. ఈ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ కేఎం జోసె్‌ఫలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జోక్యం చేసుకుని.. వాదనలకు ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించింది. ఒక రోజు సమయం పడుతుందని నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. మార్చి 28న విచారిస్తామని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa