డిప్యూటీ సీఎం నారాయణస్వామిని తిరుమలలో ఓ భక్తురాలు నిలదీసిన ఘటన హాట్టాపిక్గా మారింది. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాయణస్వామి ఆలయం వెలుపలకు రాగా ఓ భక్తురాలు ‘మీరు ఏదైనా మంత్రి పదవిలో ఉన్నారా’ అని ప్రశ్నించింది.అవును ఏంటో చెప్పండి అంటూ నారాయణస్వామి బదులివ్వగా, గదులు పొందే కేంద్రం వద్ద పరిశుభ్రంగా లేదని, చాలా దారుణమైన వాసన వస్తోందని ఆమె చెప్పింది. ఈవోకు చెప్తానని నారాయణస్వామి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, తాను ఈవోకు కాల్ చేస్తున్నా ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో తాను ఈ విషయాన్ని ఈవో దృష్టికి తీసుకువెళతానంటూ నారాయణస్వామి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa