తాడేపల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మంగళగిరి విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నక్కల సత్యనారాయణ ఒక ప్రకటనలు తెలిపారు. అత్యవసర విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1: 30 వరకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాస ప్రాంతం నుండి కృష్ణా కరకట్ట వెంబడి కొండవీటి వాగు ఎత్తిపోతల పధకం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని తెలిపారు. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa