ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపుకు అందరూ తమ శాయశక్తుల కృషి చేయాలని తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. తాడికొండ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారితో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి గుర్తింపు కార్డులను అందజేశారు. సురేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. నేడు సమాజంలో సోషల్ మీడియా పాత్ర అధికంగా ఉందని వివరించారు. ఎల్లో మీడియా ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పాలనను చూసి ఓర్వలేక అసత్యాలను ప్రచారం చేస్తుందన్నారు.
జనంలో వ్యతిరేకత ఉందని తప్పుడు రాతలను కొన్ని పత్రికల రాస్తున్నాయని, వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత సోషల్ మీడియా పై ఉందన్నారు. వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని చెప్పారు. ఇటీవల నియోజకవర్గంలో తను పర్యటించగా ముఖ్యమంత్రి పై ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారని వెల్లడించారు. ఆయా కార్యక్రమాలకు విరివిగా ప్రజలు తరలివచ్చి తమ అభిమానాన్ని వెల్లడిస్తున్నారని తెలియజేశారు. అనంతరం తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల సోషల్ మీడియా కన్వీనర్లులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సోషల్ మీడియా కో కన్వీనర్ నల్లూరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa