ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ 18 స్థానాల్లోనే మాకు టైట్్ ఫైట్.. కొడాలి నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 06:14 PM

టీడీపీ, జనసేన పార్టీలు కలసి వచ్చే ఎన్నికల్లో వచ్చినా తమకు కేవలం 18 స్థానాల్లోనే టైట్ ఫైట్ ఉంటుందని రాబోయే ఎన్నికల్లో ఫలితాల పై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మళ్లీ ఏడాది తర్వాత మాట్లాడుకుందామని..175కి 175 సీట్లు గెలవాలని సీఎం జగన్ కోరుకుంటున్నారన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండాలమ్మ దేవాలయం నూతన పాలక మండలి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. కొన్ని మీడియా సంస్థలను చూసి ఆయన లెక్కలేసుకోరని.. జగన్ మోహన్ రెడ్డి ఒక బిజినెస్ మ్యాన్ అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయమైనా , రాజకీయాలైనా కార్పొరేట్ ఆఫీస్ మాదిరిగానే నడుపుతారన్నారు. ఎన్నికలపై జగన్, వైఎస్సార్‌సీపీకి కొన్ని లెక్కలున్నాయన్నారు.


టీడీపీ , జనసేన కలిసి వస్తే ఈ రాష్ట్రంలో 18 చోట్ల ఎన్నికల్లో టైట్ ఫైట్ నడుస్తుందన్నారు. కేవలం 18 చోట్ల మాత్రమే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుందని.. మిగిలిన అన్ని చోట్లా వార్ వన్ సైడే అని జోస్యం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ఎవరిని నిలబెడితే వారే గెలుస్తారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , పనికిరాని దద్దమ్మ లోకేష్ జగన్ గురించి నోటికొచ్చినట్లు తిడుతున్నారని.. ఎన్ని నిందలేస్తున్నా ప్రజల కోసం జగన్ మోహన్ రెడ్డి భరిస్తున్నారన్నారు.


విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఏ విధమైన రాయితీలు అందిస్తారో వ్యాపారవేత్తలకు వివరిస్తున్నామన్నారు. ఈ సమ్మిట్ తర్వాత రాష్ట్రానికి భారీగా పరిశమ్రలు వస్తాయన్నారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పేదవాడి ఆర్థిక బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ఇవ్వని సంక్షేమ పథకాలను పేదవారి కోసం ఏపీలో మాత్రమే ముఖ్యమంత్రి అందిస్తున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి అంటే రోడ్లు వేయటం నిర్మాణాలు కట్టడమే కాదని.. ప్రతి పేదవాడిని ఆర్థికంగా బోలోపేతం చేయడమన్నారు.


హైదరాబాద్‌లోని ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్ధి ఇటీవల చనిపోవడం బాధాకరమన్నారు కొడాలి నాని. తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తికి మించి కొందరు తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివిస్తున్నారన్నారు. కానీ అక్కడ డబ్బున్నోళ్లను ఒకలా.. లేనోళ్లను ఒకలా చూస్తున్నారన్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిసినా జగన్ మోహన్ రెడ్డి అన్నింటికీ తెగించారని.. పేదల తరపున పోరాటం చేస్తున్నారన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతో శ్రమిస్తున్నారని.. ప్రైవేట్ విద్యా సంస్థలతో జగన్ యుద్ధం చేస్తున్నారన్నారు.


మరోవైపు కృష్ణాజిల్లాలో పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న కొండాలమ్మ దేవస్థానం అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానని కొడాలి నాని హామీ ఇచ్చారు. త్వరలోనే పేద ప్రజలకు ఉపయోగపడే కల్యాణ మండప నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొండాలమ్మ తల్లి ఆశీస్సులుండాలని కోరుకుంటున్నాను అన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa