త్వరలో జరిగే ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పరీక్షలు కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను బంద్ చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఇదిలావుంటే ఈనెల 15 నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాలకు దగ్గర్లోని జిరాక్స్ దుకాణాలను మూసివేసేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేందుకు గాను ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, మాల్ ప్రాక్టీస్ వంటి రూమర్ల కారణంగా స్టూడెంట్స్ను ఆందోళనకు గురి చేసే ప్రయత్నాలు జరగుతుంటాయని అటువంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా ఉండాలని.., జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్ రూమ్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు.
ఇదిలావుంటే ఇంటర్ పరీక్షలకు మెుత్తం 10,03,990 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 18004257635 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa