తాను ఏ కులమో చెప్పుకోలేని వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడేమో కాపు అన్నాడని, నిన్న ఏమో బీసీ అంటున్నాడని, చిరంజీవి పార్టీ పెట్టి ఓటమి చెందిన తర్వాత రోజే అన్నను వదిలేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఘాటుగా విమర్శలు కురిపించారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన పదేళ్లలో ఒక్క సర్పంచ్ను కూడా గెలిపించుకోలేకపోయారని దుయ్యబట్టారు.
జనసేన పనికిమాలిన పార్టీ అని, టీడీపీ అధినేత చంద్రబాబుకు భజన చేసే పార్టీ అని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ప్యాకేజీకి అమ్ముడుబోయే పార్టీ జనసేన అని, చంద్రబాబుకు ఊడిగం చేసే పార్టీ అని ఆరోపణలు చేశారు. సీఎం జగన్ సవాల్ చేసిన విధంగా రాష్ట్రంలో సింగిల్గా 175 స్దానాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీ లేదా జనసేనకు ఉందా..? అంటూ ప్రశ్నించారు. జగన్ అనే సింహాం సింగిల్గా వస్తుందని, 2024 ఎన్నికల్లో 175 సీట్లు వైసీపీ గెలుస్తుందని వెల్లంపల్లి జోస్యం చెప్పారు.
పవన్ కళ్యాణ్ పనికిమాలిన వారని, ఎమ్మెల్యేగా గెలవని దద్దమ్మ అంటూ వెల్లంపల్లి విమర్శించారు. రోజుకో మాట, పూటకో వేషం వేసేవారని, ఊసరవల్లికి సరైన పేరు పవన్ కల్యాణ్ అంటూ వెల్లంపల్లి విమర్శించారు. అయితే శనివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో బీసీ సదస్సు పవన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సమస్యలు, ఇతర అంశాలపై చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa