వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ బలపరచిన పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిదే గెలుపు అని ఎమ్మెల్సీ బిటి నాయుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోసిగిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూతును పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఖచ్చితంగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లష్టర్ ఇన్ చార్జ్ భరద్వాజ్ శేట్టి, మండల కన్వీనర్ జ్ఞానేష్, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి నాడిగేని అయ్యన్న, పంపాపతి, నాడిగేని వీరారెడ్డి, కప్పయ్య, గోపాల్ లక్ష్మీకాంత్, ఈరయ్య, తెలుగు యువత మండల అధ్యక్షులు నాడిగేని మహదేవ్, యం పి టి సి సభ్యులు రాజు, వందగల్ మాజీ సర్పంచ్ నరసింహులు, పల్లేపాడు మాజీ సర్పంచ్ చంద్ర, ముగలదోడ్డి శీను, హనుమంతు రెడ్డి, సజ్జలగుడ్డం నరసింహులు, దోడ్డి రంగారెడ్డి, మంజు, బెళగల్ రాజశేఖర్ రెడ్డి, భూంపల్లి నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa