రాష్ట్రంలో G20 సమావేశాలకు ముందు ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని పంజాబ్ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, అమృత్సర్లో ప్రపంచ ఈవెంట్ను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు బుధవారం నిరసనను నిర్వహించాయి. భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్) మరియు పంజాబ్ లోక్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన మార్చ్ ప్రారంభించబడింది. జి20 సమ్మిట్ సమావేశ వేదికకు 12 కిలోమీటర్ల దూరంలోని డబుర్జి ప్రాంతంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని, జి20 సమ్మిట్ వేదికల వద్ద నిరసనలు తెలిపేందుకు ఎవరినీ అనుమతించబోమని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.రైతు నాయకులు మాట్లాడుతూ జీ20, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఈ అంతర్జాతీయ సంస్థలు లాభాలు ఆర్జించేందుకు భారత్ వంటి దేశాల వనరులను దోపిడీ చేస్తున్నాయని వారు పేర్కొన్నారు.భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్) చీఫ్ జోగీందర్ సింగ్ ఉగ్రహన్ మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థలు అనుసరిస్తున్న విధానాలు సాధారణంగా రైతులు మరియు ప్రజల ప్రయోజనాలను రక్షించడం లేదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa