ఇటీవల సాంకేతికత అందుబాటుులోకి వచ్చాక ఇండ్లలో డబ్బు నిల్వ తక్కువగా ఉంటోంది. దీంతో దేవాలయాలే టార్గెట్గా దొంగలు రెచ్చిపోతున్నారు. సీసీ కెమెరాలను సైతం లెక్క చేయకుండా హుండీలను బద్దలు కొట్టి మరీ దేవుడి సొమ్ములు కాజేస్తున్నారు. తాజాగా, తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో ఒకే రోజు మూడు దేవాలయాల్లోకి దొంగలు చొరబడి.. హుండీలు పగులకొట్టి చోరీలకు పాల్పడ్డ సంఘటనలు కలకలం రేపుతున్నాయి.తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం గజ్జరం అడ్డరోడ్డులో జరిగిన ఈ దొంగతనాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. గజ్జరం అడ్డరోడ్డులో కనకదుర్గమ్మ గుడి, గోపవరం సమీపంలో మేరీమాత విగ్రహం వద్ద, అలాగే మరో ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు.
దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు ఏ మాత్రం లెక్కచేయకుండా చోరీకి పాల్పడటం గమనార్హం. భక్తులు హుండీలో వేసిన డబ్బులను దోచుకెళ్లిన ఈ దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాళ్లపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీలకు పాల్పడడ్డ వారు పాత నేరస్థులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa