వాహనదారులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని, అతి వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపరాదని చీరాల టూ టౌన్ సిఐ సోమశేఖర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల -ఒంగోలు బైపాస్ రోడ్డులో ఆయన శనివారం "నో యాక్సిడెంట్స్ డే" డ్రైవ్ చేపట్టారు. రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించక పోవటం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ లు వాహనాలు నడపడం వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని కోరారు. ఒకవేళ మైనర్లు వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురి అయితే వాహన యజమాని కూడా ముద్దాయి అవుతాడని సోమశేఖర్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు మీ భద్రత, మీ కుటుంబ క్షేమం దృష్టిలో ఉంచుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa