రాష్ట్రంలో సీఎం జగన్రెడ్డి మోసపూరిత పాలనకు ఇసుక పాలసీయే నిదర్శనమని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్ మొత్తం సీఎం జగనే అమ్ముకుంటున్నారని ఽనిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లాలో 18రీచ్లకు రూ.18కోట్లు ఫైన్వేస్తూ ఇటీవల ఎన్జీటీ ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించిన రీచ్లకు రూ. కోటి చొప్పున చెల్లించాల్సి వస్తే రాష్ట్రంలో రూ. 450 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇసుక మొత్తం సీఎం అమ్ముకోవాలి.. ఎన్జీటీకి ప్రజల సొమ్ము ఫైన్గా చెల్లించాలా అని ప్రశ్నించారు. ఇక, తిరుమలలోనూ గంజాయి చూడటం దారుణమన్నారు. ఇటువంటి సీఎంను ప్రజలు త్వరలోనే ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa