మహారాష్ట్రలోని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు అన్ని రకాల బస్సు ప్రయాణాలపై 50 శాతం ప్రయాణ తగ్గింపును ఆమోదిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.అంతేకాకుండా, మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటకలోని 865 మరాఠీ మాట్లాడే గ్రామాలకు మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్ ఆరోగ్య యోజన ప్రయోజనాల అమలుకు సంబంధించి ప్రభుత్వం GRని కూడా జారీ చేసింది.ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని, మహిళలకు పన్ను రాయితీలు కల్పించిందన్నారు. మహాత్మా ఫూలే జన్ ఆరోగ్య పథకం (ఆరోగ్య బీమా) కవరేజీని రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. బడ్జెట్లో అన్ని ప్రాజెక్టులను అభివృద్ధి చేశామని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే పురాతన ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, మహాత్మా జ్యోతిబా ఫూలే పథకానికి రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa