తాను జైల్లో ఉన్నప్పుడు ఎంతో టార్చర్ అనుభవించానని.. అమరావతి ఎంపీ నవనీత్ రాణా వ్యాఖ్యానించారు. ఎంత టార్చర్ పెట్టినా.. తనపై తనకున్న నమ్మకాన్ని సడలించలేదని స్పష్టం చేశారు. గతేడాది ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆయన ఇంటిముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తానని పిలుపునిచ్చిన నవనీత్ రాణాను.. పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను జైలుకు కూడా పంపారు. అయితే.. ఆ జైలులో తానెంతో చిత్రహింసలకు గురయ్యానని చెబుతూ ఎంపీ నవనీత్ రాణా భావోద్వేగానికి లోనయ్యారు.
నవనీత్ రాణా పుట్టినరోజు, హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గతేడాది జైలుకు వెళ్లిన సంఘటనను గుర్తుచేసుకున్న నవనీత్.. జైలులో ఎన్ని చిత్రహింసలు పెట్టినా, వారు మాత్రం తన నమ్మకాన్ని వమ్ము చేయలేకపోయారని చెప్పారు. ఆ సమయంలో తన పిల్లలు కూడా ప్రశ్నించేవారని.. ఏం తప్పు చేశావు.. ఎందుకు జైలుకు వెళ్లావని.. అడిగారని గుర్తు చేశారు. ఇటు ఉద్ధవ్ ఠాక్రేపైనా నవనీత్ రాణా విమర్శలు గుప్పించారు. ఆయన పార్టీ, వారి సిద్ధాంతాలను కూడా కాపాడుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. సొంత కుమారుడే పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కడం చూస్తే.. బాలాసాహెబ్ ఠాక్రే కన్నీరు పెట్టుకునేవారని ఫైర్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa