పొన్నూరు పట్టణంలోని బిజెపి కార్యాలయంలో గురువారం భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు మొగలిపువ్వు సాంబశివరావు బిజెపి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అభివృద్ధి సంస్కరణలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి పాలనలోనే జరిగిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడి భారత్ పలురంగాలలో ముందుందని అన్నారు. 43 ఏళ్ల బిజెపి ప్రస్తావనం ఎన్నో ఉడుదుడుకులు అధిగమించి నిలిచిందన్నారు. కార్యక్రమంలో బిజెపి పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి కలపాల శ్రీనివాసరావు, నల్లమోతు కోటమ్మ రాజు, కిసాన్ మోర్చా కార్యదర్శి గుడివాడ పవన్, పట్టణ కార్యదర్శి తన్నీరు శివరామకృష్ణ, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa