టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అవినీతి, అక్రమాల పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని నరసరావుపేట నియోజకర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹ చదలవాడ అరవింద బాబు అన్నారు. గురువారం నరసరావుపేట పట్టణంలోని 32 వ వార్డ్ బరంపేట బైపాస్ రోడ్ లోని "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ. ప్రజా సమస్యలు పరిష్కారస్తారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే, ఆయన మాత్రం ప్రజా సంక్షేమం గాలికొదిలి సొంత సంక్షేమం పై దృష్టి సారించారని ఎద్దేశా చేశారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో నియోజవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేసిన అవినీతి, అరాచకాలకు లెక్క లేదన్నారు. నియోజకవర్గంలోని జరిగే ప్రతి పనిలో ఎమ్మెల్యేకు ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు.
గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయాలు సంపాదించాడని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అవినీతి, అక్రమాల పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డా౹౹చదలవాడ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 32 వార్డు నాయకులు షేక్ అబ్దుల్ గఫార్, ఆకుల కిషోర్, పల్లబోతు ప్రసాద్, తోటా సాంబశివరావు, కొల్లి నరసింహారావు, మువ్వల రవీంద్ర, అశోక్ కుమార్, షేక్ రహీమ్, షేక్ జానీ బాషా, షేక్ అమీరూన్, నారే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa