తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లి కురపకణం వద్ద ఈనెల 1వతేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాజు కారుతో సహా సజీవ దహనం హత్య కేసులో 4గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన వారిలో ఏ1రుపింజేయ, ఏ3 గోపినాద్ రెడ్డి, ఏ4 అపన్న కుమార్, అపన్న రమేష్ నలుగురు అరెస్ట్ చేసి రిమాండ్ కు పోలీసులు తరలించారు.
తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన కారుతో సహా సజీవ దహనం హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు అక్రమ సంబంధం కుటుంబ గౌరవమే ప్రధాన కారణమని ఏఎస్పీ వెంకట్రావు వెల్లడించారు. వెదురుకుప్పం మండలం దిగువ బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, పురుషోత్తం అన్నదమ్ములు బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. పురుషోత్తం తమ ఇంటి పక్కనే ఉన్న రుపింజేయ భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని నెపంతో, నాగరాజు అసభ్యకరంగా మాట్లాడారని ఎలాగైనా వీరిని మట్టు పెట్టాలని నిందితులో ఐదు మంది పథకం పన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 1వ తేదీ గోపీనాథ్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా నాగరాజును పిలిపించి మద్యం సేవించి టవల్ తో గొంతు నులుమి హత్య చేసి కారులో వేసి పెట్రోలు పోసిన అనంతరం నిప్పు పెట్టి లోయలోకి తోసి, ప్రమాదంగా సృష్టించేందుకు ప్రయత్నించారు. కారు లోయలోకి పోవకపోవడం, మంటలు చెలరేగడంతో నిందితులు హత్యా స్థలం నుంచి వెనుదిరిగారు.
ఈ హత్య కేసులో మొత్తం 5 మంది నిందుతులు ఉన్నారని, ప్రస్తుతం రుపింజేయ, గోపినాద్ రెడ్డి, రమేష్, కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు. ఏ2 గా ఉన్న చాణక్య ప్రసాద్ పరారీ లో ఉన్నాడని ఆయన తెలిపారు. టీడీపీ నాయకుడు చాణిక్య ప్రసాద్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే చాణిక్య ప్రసాదం అరెస్టు చేస్తామని ఏఎస్పీ వెంకట్రావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa