ఎన్ని చర్యలు తీసుకొన్న తిరుమలలో మోసగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడంలేదు. తిరుమల శ్రీవారి దర్శనం కోస నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. వేసవి రద్దీతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. చిక్కిందే ఛాన్స్ అనుకుని కొందరు దళారులు రెచ్చిపోతున్నారు. అమాయక భక్తుల్ని నిండా ముంచేస్తున్నారు. టీటీడీ దళారుల్ని నమ్మొద్దని పదే, పదే చెబుతున్నా సరే కొందరు మోసపోతూనే ఉన్నారు. తీరా మోసపోయాక విజిలెన్స్ సిబ్బంది, పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో మరో మోసం బయటపడింది.
తెలంగాణ నాగర్కర్నూల్కు చెందిన సుమన్ తిరుపతికి చెందిన వేణు అనే దళారీని సంప్రదించారు. తనకు ఏడు సుప్రభాత సేవా టికెట్లు కావాలని అడిగారు. శనివారం రోజుకి సుప్రభాత సేవ టికెట్లు ఉన్నాయని.. ఏడు టికెట్లకు రూ.30వేలు అవుతుందని దళారీ డిమాండ్ చేశారు. ఆ డబ్బుల్ని ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయగా.. వాట్సాప్ ద్వారా టికెట్లు సుమన్కు వాట్సాప్లో పంపించారు. సుమన్ కుటుంబ సభ్యులతో కలిసి సేవలో పాల్గొనేందుకు వేకువజామున వైకుంఠం క్యూకాంప్లెక్స్ దగ్గరకు వెళ్లారు.
క్యూ కాంప్లెక్స్ దగ్గర టికెట్లను తనిఖీ చేసిన సిబ్బంది.. అవి నకిలీవని తేల్చి చెప్పారు. దీంతో సుమన్ అవాక్కయ్యారు.. తాను మోసపోయామని గుర్తించి విజిలెన్స్ సిబ్బందిని ఆశ్రయించగా.. వారు బాధితులతో కలిసి తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దళారీకి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల కూడా ఇదే తరహాలో మోసాలు జరిగాయి. ఇటీవల తమిళనాడుకు చెందిన మరో భక్తుడు కూడా రూ.300 టికెట్ల విషయంలో మోససోయాడు. ఏకంగా నాలుగు రూ.300 టికెట్లను రూ.18 వేలకు విక్రయించగా.. అవి స్పెషల్ దర్శనం టికెట్లు అనకున్నాడు భక్తుడు.. కానీ అవి రూ.300 టికెట్లు అని తెలియడంతో అవాక్కయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దళారీలకు అడ్డుకట్ట వేసేందుకు టీటీడీ సరికొత్తగా ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వసతి గదులతో పాటూ మరికొన్ని చోట్ల ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అంతేకాదు దళారీలను నమ్మి మోసపోవద్దని టీటీడీ పదే, పదే చెబుతూనే ఉంది.. అయినా సరే కొందరు మాత్రం మోసపోతూనే ఉన్నారు.
టీటీడీ ఈ నెల 1 నుంచి దివ్య దర్శనం టికెట్లను కూడా జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలిపిరి మార్గంలో 10 వేలు, మెట్టు మార్గంలో 5వేల టికెట్లను రోజూ జారీ చేస్తోంది. వేసవితో పాటూ వరుస సెలవులతో తిరుమలలో రద్దీ కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. దీంతో టీటీడీ టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావొద్దని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa