విజయనగరం జిల్లా, కొత్తవలస మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ, వినాయకనగర్లో రంజాన్ పండుగ సందర్భంగా ఫర్ది పీపుల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా విశాఖపట్టణానికి చెందిన షేక్ జిలాని ఒంటరిగా జీవనం సాగిస్తున్న వృద్ధులకు నిత్యావసరాలు అందించి, అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జామద్ ఇస్లామి హింద్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సయ్యద్, హమీద్ సన్స్ నిజాముద్దీన్, షేక్సలీం హాజరై ఖురాన్లో పేదలకు సాయం చేయడంపై వివరించారు. రంజాన్ పండగ విశిష్టతను వివరించారు. ముస్లింలు నిర్వహించే పండగల సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa