సీఎం జగన్ పై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన దాడి కోడి కత్తి కేసు విచారణ సోమవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ప్రారంభమైంది. కోడి కత్తి కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఎన్ఐఏ, నిందితుడి తరపున న్యాయవాదులు వేసిన కౌంటర్లపై సీఎం జగన్ తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఫైనల్ రిపోర్ట్ వెయ్యనందున సామాన్యూలు ఎవరైనా విచారణ ఇంకా జరుగుతూనే ఉందనుకుంటారని తెలిపారు. స్టేట్ పోలీస్లు రిలీజ్ చేసిన ఫ్లెక్సీ... నిందితుడు వైసీపీ సింపతైజర్ అని చెప్పేందుకు కావాలనే ప్రయత్నించారన్నారు. నిందితుడి కుటుంబానికి జన్మభూమి కమిటీ ద్వారా ఇంటి స్థలం కూడా సాంక్షన్ అయిందని కోర్టుకు తెలిపారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, టీడీపీతో సంబంధాలు ఉన్న వ్యక్తికి ఎయిర్పోర్టులో ఎలా ఉద్యోగం ఇచ్చారని ప్రశ్నించారు. ఇవన్నీ అనేక అనుమానాలకు కారణం అవుతున్నాయన్నారు. అలాగే ఆపరేషన్ గరుడ అంశాన్ని జగన్ తరపు న్యాయవాది తన వాదనలో ప్రస్తావించారు. బాధితునిగా సీఎం జగన్కు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయించాలని అడిగే హక్కు ఉంటుంది అంటూ వాదనలు వినిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa