తెలంగాణ ప్రజల్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని.. వైఎస్సార్సీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాన్ సూచించారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం అభ్యంతరకరంగా ఉందన్నారు. ఒక జాతిని అవమానిస్తుంటే సీనియర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వ్యాఖ్యలు చేయడం.. దానికి ప్రతి స్పందన వైఎస్సార్సీపీ నేతలు స్పందించారన్నారు. ఈ క్రమంలో ఏపీ నేతలు హద్దులు దాటి మాట్లాడారన్నారు.. ఇది ఇబ్బందిగా మారిందన్నారు. పాలకులు వేరు, ప్రజలు వేరని.. పాలకులు చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు సంబంధం లేదన్నారు. పాలకులు చేసిన వ్యాఖ్యలు ప్రజలకు వర్తించవన్నారు.
కానీ ఏపీ మంత్రులు స్పందిస్తూ.. తెలంగాణ ప్రజల్ని, ప్రాంతాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడటం తనకు మనస్తాపం కలిగించింది అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఆ మంత్రిని, వ్యక్తిని ప్రస్తావించాలన్నారు. కానీ ఈ వివాదంలోకి ప్రజల్ని లాగొద్దన్నారు. ఒక జాతి, జాతి అని తిట్టడం సరికాదన్నారు.
ఏపీకి చెందిన వారికి తెలంగాణలో వ్యాపారాలు, ఇళ్లు లేవా అన్నారు. దయచేసి మంత్రివర్గంలో ఉన్నవాళ్లు, ఎమ్మెల్యేలు అదుపుతప్పి మాట్లాడితే ముఖ్యమంత్రి స్పందించాలని.. తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు వపన్ కళ్యాణ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa