తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 33వ మలుపు వద్ద ఆరుగురితో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఘాట్రోడ్డు పక్కన లోతు తక్కువగా ఉండటంతో వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన ఇతర ప్రయాణికులు ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను కారు నుంచి బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో భక్తులకు ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సరిగ్గా వారం రోజుల క్రితం కూడా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఇలాంటి ప్రమాదమే జరిగింది. 24వ మలుపు వద్ద కారు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో గుంటూరుకు చెందిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు నడుపుతున్న వ్యక్తి కంగారులో ఎక్సలేటర్ తొక్కడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa