యువగళం పాదయాత్రలో భాగంగా 79వ రోజు సోమవారం ఆదోని నియోజకవర్గం పెద్దతుంబళం క్రాస్ వద్ద సర్పంచులతో నిర్వహించిన ‘పల్లె ప్రగతి కోసం మీ లోకేశ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సర్పంచులు హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి సర్పంచులు అడిగిన పలు ప్రశ్నలకు లోకేశ్ సమాధానం ఇచ్చారు. గ్రామీణాభివృద్ధికి టీడీపీ ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో వివరించారు. పట్టణాలకు దీటుగా పల్లె సీమలను అభివృద్ధి చేస్తామని, ప్రణాళికాబద్ధంగా తాగునీరు, వీధి దీపాలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, గ్రీన్ అంబాసిడర్ వంటి కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తామన్నారు. ‘‘ఒక్క ఏడాది ఓపిక పట్టండి, మీరందరూ కోరుకుంటున్న మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మన నేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పల్లె సీమల్లో స్వర్ణయుగం తీసుకువస్తాం’’ అని లోకేశ్ అన్నారు. ‘‘టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ఏనాడూ చెప్పలేదు. వాటిని పంచాయతీలకు అనుసంధానం చేసి పల్లె సీమలను ప్రగతి పథంలో నడిపిస్తాం’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa