కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం సివిల్ జడ్జి కోర్టులో ఈనెల 13న జరగబోయే జాతీయ లోక్ ఆదాలపై సివిల్ జడ్జి శ్రీనివాస కళ్యాణ్ అధ్యక్షతనగురువారం, సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు సిద్ధవటం మండల ఎస్సై తులసి నాగ ప్రసాద్, , ప్యార లీగల్ వాలంటీర్లు సమావేశంలో పాల్గొన్నారు.మీడియాతో సిద్ధవటం సివిల్ జడ్జ్ శ్రీనివాస కళ్యాణ్ మాట్లాడుతూ మే నెల 13న సిద్ధవటం సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని కావున సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవడానికి, మంచి అవకాశం అని దీర్ఘకాలిక పెండింగ్ కేసులు ఉన్న వారు సమస్య పరిష్కారం చేసుకోవాలని అన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa