కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా కొనసాగుతోంది. శ్రీనివాసుని దర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. గురువారం రోజు స్వామివారిని 64,707 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,676 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 3.98 కోట్ల ఆదాయం వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa