ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు బెజవాడలో వైకాపా శాసనసభాపక్షం సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 07:27 AM

అమరావతి: నవ్యాంధ్రలో తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ప్రతిపక్షంగా ఎలా వ్యవహరిద్దాం.. ఎలా సంసిద్ధమై వెళదామనే అంశాలపై ప్రతిపక్ష వైకాపా చర్చిస్తోంది. ఇందులో భాగంగా ప్రాథమికంగా నిర్దేశించుకున్న అజెండాను సోమవారం విజయవాడలో జరగనున్న పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఖరారు చేయనున్నారు. వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వస్తారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్న ఆయన నేరుగా రహదారులు భవనాల శాఖ అతిథిగృహానికి చేరుకుంటారు. అక్కడ 9 గంటల ప్రాంతంలో ఆయన అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. శాసనసభాపక్షం నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ఎన్నుకోనున్నారు. సోమవారం మధ్యాహ్నం వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు నాని, ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa