విశాఖపట్నంలోని మధురవాడకు చెందిన గేదెల భరత్కుమార్ ఈనెల రెండో తేదీ రాత్రి మధురవాడ నుంచి తన స్నేహితులు వెంకటేష్, మధు, శివలతో కలిసి శ్రీకాకుళంలోని వెంకటేష్ అత్తవారి ఇంటికి వచ్చారు. అయితే గేదెల భరత్కుమార్ అదేరోజు అర్ధరాత్రి తాను విశాఖపట్నం వెళ్లిపోతానని చెప్పడంతో తన వెంట వచ్చిన స్నేహితులు వెంకటేష్, శివలు శ్రీకాకుళం నవభారత్ జంక్షన్కు తీసుకొచ్చి ఓ ప్రైవేటు బస్సు ఎక్కించారు. ఆయన వద్ద చార్జీకి డబ్బులు లేకపోవడంతో ఆ ప్రైవేటు బస్సులోని క్లీనర్ బొమ్మాళి అప్పన్న, డ్రైవర్ వెలమలశెట్టి రామకృష్ణలు గొడవపడ్డారు. శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలంలోని బుడుమూరు జాతీయ రహదారిపై బస్సులో నుంచి బయటకు నెట్టేచారు. తన స్నేహితులు పోన్పే చేస్తానని చెప్పారని, వారు వేసిన వెంటనే చార్జీ డబ్బులు ఇస్తానని భరత్కుమార్ చెప్పినా కూడా డైవర్, క్లీనర్లు భరత్కుమార్ను బస్సులో నుంచి బయటకు తోసే యడంతో గాయపడ్డాడు. దీంతో గాయపడిన భరత్కుమార్ మృతిచెందాడు. సీసీ కెమెరాలు ఆధారంగా క్లీనర్, డ్రైవర్ను పట్టుకున్నారు.ఈ మేరకు బస్సు క్లీనర్ బొమ్మాళి అప్పన్న, డ్రైవర్ వి.రామకృష్ణలను అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa