పశ్చిమగోదావరి జిల్లాలో కొత్త రెవిన్యూ డివిజన్ గా తాడేపల్లిగూడెం వైసీపీ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో పశ్చిమ గోదావరి జిల్లాలో డివిజన్ల సంఖ్య మూడుకు పెరిగింది. కొత్తగా ఏర్పడిన తాడేపల్లిగూడెం డివిజన్లో తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల పరిధిలో ఐదు మండలాలతో పాటూ నరసాపురం డివిజన్లో ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాలు ఉంటాయి. అలాగే భీమవరం డివిజన్లో భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలోని.. ఆరు మండలాలతో పాటు ఇటీవల జిల్లాలో విలీనం చేసిన గణపవరాన్ని చేర్చారు.
అంతేకాదు మరో ఆరు మండలాలను ప్రభుత్వం విభజించింది. ఈ మేరకు తుది నోటిఫికేషన్లను జారీ చేశారు. ఒంగోలు, విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం మండలాలను అర్బన్, రూరల్ మండలాలుగా నోటిఫై చేశారు. అలాగే మచిలీపట్నం మండలాన్ని సౌత్, నార్త్ మండలాలుగా విభజించారు. ఈ నోటిఫికేషన్లు సోమవారంనుంచి అమల్లోకి వచ్చేశాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలాన్ని రెండు మండలాలుగా విభజనించారు. ఒంగోలు అర్బన్, రూరల్ మండలాలుగా ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ప్రస్తుతం ఒంగోలు మండలంలో 21 గ్రామాలు ఉన్నాయి.. ఇప్పుడు వాటిని రెండు మండలాలుగా విభజించింది ప్రభుత్వం. ఒంగోలు అర్బన్ మండలంలో 12 గ్రామాలు, ఒంగోలు రూరల్ మండలంలో తొమ్మిది గ్రామాలు ఉన్నాయి.
ఒంగోలు అర్బన్ మండలంలో అన్నవరప్పాడు, మామిడిపాలెం, వెంగముక్కలపాలెం, ఒంగోలు, మల్లేశ్వరపురం, నరసాయపాలెం అగ్రహారం, త్రోవగుంట, కొప్పోలు, ముక్తినూతలపాడు, గుడిమెళ్లపాడు, చెరువుకొమ్ముపాలెం, పెళ్లూరులు ఉన్నాయి. ఒంగోలు రూరల్ మండలంలో దేవరంపాడు, ఉలిచి, చేజర్ల, కరవది, సర్వేరెడ్డిపాలెం, యరజర్ల, మంగళాద్రిపురం, వలేటివారిపాలెం, మండువవారిపాలెంలు ఉన్నాయి. అలాగే మిగిలిన మండలాల విభజనలో కూడా గ్రామాలను ఇలాగే విభజించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa