గుంతకల్లు పట్టణ, మండలంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి వైకాపా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నమోదు చేశామని టిడిపి బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి, కౌన్సిలర్ పవన్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల నమోదు పత్రాలను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో టిడిపి నాయకులు పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయానికి పంపారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజవంతంగా చేయ డంలో భాగస్వామ్యం అయిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పవన్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి బిసి సెల్ పార్లమెంటు ఉపాధ్యక్షుడు కేశప్ప, నాయకులు మధు, శివన్న, ఫజులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa