ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయాన్ని సందర్శించిన స్వామిత్వ స్పెషల్ కమిషనర్ డాక్టర్ సిరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 27, 2023, 01:47 PM

పెడన నియోజకవర్గం పెడన మండలంలోని పెనుమల్లి సచివాలయాన్ని స్వామిత్వ స్పెషల్ కమిషనర్ డాక్టర్ సిరి శనివారం సందర్శించారు. పెడన మండలంలోని పెనుమల్లి గ్రామ సర్పంచ్ గరికపాటి రామానాయుడు కమిషనర్ బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సచివాలయంలో రామానాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమీషనర్ మాట్లాడుతూ స్వామిత్వ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొనే ఎందుకే తాము ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా 200 గ్రామాలలో ఈ విధానాన్ని అమలు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమీషనర్ మాట్లాడుతూ, స్వామిత్వ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకే తాము ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 గ్రామాలలో ఈ విధానాన్ని అమలు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని అమలు పరుస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేటు భూములకు ఈ సర్వే ఫలితాలు వర్తిస్తాయన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు కూడా ఈ సమగ్ర సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. కృష్ణా జిల్లాలో 40 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరరావు నాయక్ వివరించారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి సర్పంచి వెంకటేశ్వరరావు, డిఎల్పిఓ జ్యోతిర్మయి, పంచాయితీ కార్యదర్శి అహ్మద్, వీఆర్వో ప్రసాద్, గోవిందరాజులు, ఇతర పంచాయతీ రాజ్ రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa