మంగళగిరి పట్టణం 29 వ వార్డుకి చెందిన తమ్మిశెట్టి కోటేశ్వరమ్మ పట్టణం పరిధిలో అద్దె బండి పై మరమరాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. తనకు వచ్చే డబ్బులు అద్దెలకే సరిపోతున్నాయని సొంతగా బండిని అందజేయాలని నారా లోకేష్ కు అర్జీ రూపంలో విన్నవించుకున్నారు. ఈ మేరకు స్పందించిన నారా లోకేష్ తమ్మిశెట్టి కోటేశ్వరమ్మ జీవనోపాధి నిమిత్తం మంగళవారం తోపుడు బండిని స్థానిక నాయకుల చేతుల మీదుగా మంగళగిరి నగరంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో అందజేయించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ , 29 వ వార్డు అధ్యక్షులు షేక్ కరిముల్లా, నాయకులు షేక్ షమీరా, తుమ్మల అనురాగ్, తిరువీధుల బాపనయ్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa