ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 05, 2023, 11:42 AM

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని మోపర్రు గ్రామంలో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మోపర్రు సెంటర్లో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో చుండూరు మండల పరిధిలోని మండూరు గ్రామానికి చెందిన రాజేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో 108 సహాయంతో తెనాలి ఏరియా వైద్యశాలకి తరలించారు. రాజేష్ (40)మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మోపర్రు గ్రామానికి చెందిన వరప్రసాద్ కు గాయాలయ్యాయి, 108 సహాయంతో క్షతగాత్రులను తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa