ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స మరియు సేవల నాణ్యతను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం అన్నారు.విధానసౌధలోని బాంక్వెట్ హాల్లో ఆరోగ్యశాఖ, ఇండియన్ యూనిటీ సెంటర్ సహకారంతో జరిగిన ఫ్లోరెన్స్ నైటింగేల్నర్సెస్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. నాతో సహా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందేలా వ్యవస్థను రూపొందించాలి. ఇందుకు ప్రభుత్వం, ఆరోగ్య కార్యకర్తలు కృతనిశ్చయంతో కలిసి పనిచేయాలన్నారు.జయదేవ ఆసుపత్రి ఒక మోడల్. రాజకీయ నాయకులందరికీ ఈ ఆసుపత్రిలో వైద్యం చేస్తారు. జయదేవ ఆసుపత్రిలో నాణ్యత, పరిశుభ్రత, క్రమశిక్షణ కొనసాగుతుంది. ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ఇదే వ్యవస్థను రూపొందించడం సాధ్యమవుతుంది అని కర్ణాటక సీఎం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa